నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. విశాఖపట్నంలో ప్రముఖ ఐటీ, నాన్ ఐటీ కంపెనీలో జూలై 19న మెగా జాబ్(job mela)మేళా నిర్వహించనున్నాయి. 18–30 ఏళ్ల వయసుగల నిరుద్యోగ అభ్యర్థులు తమ అర్హతల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియకు హాజరుకావచ్చు. పూర్తి వివరాలు..

టెన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్, తదితర ఉత్తీర్ణత కలిగిన నిరుద్యోగులు ఈ జాబ్మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు వెంటనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఉద్యోగ మేళాలో పాల్గొనే అభ్యర్థులు స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఈ నెల 19న డాటా ప్రో, ద్వారాకానగర్ క్యాంపస్లో ప్రత్యేక మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్లు ప్రకటన విడుదల చేశారు. డాటా ప్రో 35వ వార్షికోత్సవం సందర్భంగా ఈ జాబ్మేళా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
అపోలో ఫార్మసీ, వరుణ్ మోటార్స్, కియా మోటార్స్, విజన్ ఇండియా, టెక్ మహింద్రా, మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, డెక్కన్, డైకిన్, హ్యూండాయ్, జోస్ట్ తదితర కంపెనీలో తమ సంస్థలలో అర్హత కలిగిన అభ్యర్థులను పలు ఉద్యోగాలకు ఎంపిక చేసుకునేందుకు ఈ జాబ్లో ప్రాతినిధ్యం వహించనున్నాయి.
JOB MELA IN VIZAG: నిరుద్యోగులకు గుడ్న్యూస్..మెగా జాబ్మేళా