ఏపీ డీఎస్సీ దరఖాస్తు గడువు రేపటితో(మే 15)తో ముగియనుంది. ఇప్పటి వరకు 3, 03, 527 దరఖాస్తులు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో ఎస్టీజీ, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులున్నారు

ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 20న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.. రేపటితో గడువు ముగియనుండడంతో మరో 10వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా చివరి నిమిషం వరకు వేచిచూడకుండా.. అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.