Navodaya admissions 2024
జవహార్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఆరోతరగతి ప్రవేశాలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం 5వతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు..

ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ జనవరి 18, 2025న నిర్వహిస్తారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలో 5వతరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
సీట్ల వివరాలు
దేశవ్యాప్తంగా మొత్తం 653 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 13, తెలంగాణలో 9 ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో గరిష్ఠంగా 80 మందికి అవకాశం కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయిస్తారు.
పరీక్షా విధానం
నవోదయ ఎంట్రన్స్ ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. సమయం 2గంటలు ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో 40 ప్రశ్నలు(50 మార్కులు), అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్ల్లో ఒక్కోదానిలో 20 ప్రశ్నలు(మార్కులు 50) ఉంటాయి. మెరిట్, రిజర్వేషన్, గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
Navodaya: నవోదయలో 6వతరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం