Trending Posts

TG 10th Exams 2026: మార్చి 14 నుంచి పరీక్షలు ప్రారంభం – 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరు

ఏపీ టెన్త్ పరీక్షలు 2026: మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు – 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరు

హైదరాబాద్, మార్చి 12: రాష్ట్రంలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. గురువారం విడుదల చేసిన అధికారిక ప్రెస్ నోట్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మూడు గంటలపాటు పరీక్షలు జరుగనున్నాయి.

5.28 లక్షల మంది విద్యార్థులు హాజరు

ఈ ఏడాది మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో

  • 5,17,727 మంది రెగ్యులర్ విద్యార్థులు
  • 10,512 మంది ఫెయిల్ అయిన అభ్యర్థులు ఉన్నారు.

మొత్తం అభ్యర్థుల్లో

  • బాలురు – 2,67,954 మంది
  • బాలికలు – 2,60,285 మంది ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు

పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 11,674 పాఠశాలల నుంచి విద్యార్థులు నమోదు అయ్యారు.

వాటిలో

  • ప్రభుత్వ పాఠశాలలు – 6,386
  • ప్రైవేట్ పాఠశాలలు – 5,288

ప్రత్యేక అవసరాలు ఉన్న 1,408 మంది విద్యార్థులు కూడా టెన్త్ పరీక్షలకు హాజరవుతున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో

  • ప్రభుత్వ పాఠశాలలు – 2,07,573 మంది
  • వెల్ఫేర్ పాఠశాలలు – 60,139 మంది
  • ప్రైవేట్ పాఠశాలలు – 2,50,015 మంది ఉన్నారు.

పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరాలి

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే సందర్శించుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష రోజు ఉదయం 8.30 గంటలకల్లా కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9.35 తర్వాత కేంద్రంలోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.

హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో

పరీక్షల హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు క్రింది పరికరాలు తీసుకురావచ్చని అధికారులు తెలిపారు:

  • ఎగ్జామ్ ప్యాడ్
  • పెన్, పెన్సిల్
  • స్కేల్
  • షార్పనర్
  • రబ్బర్
  • జియోమెట్రీ పరికరాలు

ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధం

పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్లు, కాల్క్యులేటర్లు, స్మార్ట్ వాచీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా నిషేధించారు. పరీక్షల్లో అక్రమాలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా 144 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ అధికారులకు ప్రభుత్వం సూచించింది. ప్రతి పరీక్షా కేంద్రంలో

  • తాగునీరు
  • విద్యుత్
  • ఫ్యాన్లు

వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు.

ఆరోగ్య సిబ్బంది, కంట్రోల్ రూమ్‌లు

పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే తక్షణ సహాయం అందించేందుకు ANM సిబ్బందిని అవసరమైన మందులతో నియమించారు. సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు పాఠశాల విద్యాశాఖ కార్యాలయం మరియు జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

TG SSC Exams 2026
TG 10th Class Exams
TG SSC Exam Date
SSC Exams TELANGANA
TG 10th Hall Tickets
SSC Board ExamsTG
TG Education News

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/