హైదరాబాద్: ఐటీఐ పూర్తయిన విద్యార్థులకు వచ్చే అకడమిక్ ఇయర్ 2026-27లో పాలిటెక్నిక్ సెంకడియర్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి లెటరల్ ఎంట్రీ ఇన్ టూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-ఎల్పీసెట్ ను మార్చి 16 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు సెక్రటరీ మార్చి 12న తెలిపారు.
ఎవరు అర్హులు?
ఐటీఐలో సుమారు 60 శాతం మార్కులతో పాటుగా ఉపాధి కల్పన శిక్షణ శాఖ నిర్వహించిన బ్రిడ్జి కోర్సు పూర్త ిచేసిన అభ్యర్థులు ఈ ఎంట్రెన్స్ రాసేందుకు అర్హత కలిగి ఉంటారు. మే 15వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జమ్ నిర్వహిస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 20 లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. లేట్ ఫీజు రూ. 100 తో 21 వరకు చెల్లించవచ్చు.
దరఖాస్తు ఫీజులు
ఓబీసీలు రూ. 500, ఎస్సీ, ఎస్టీలు రూ. 300 చెల్లించాలి.







