Trending Posts

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.

దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణలో 41 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 9వ తేదీ వరకు అవకాశం ఉంది.
​పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దాంతో పాటు, బ్యాంకింగ్‌లో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. అభ్యర్థులు తమ రాష్ట్రంలోని స్థానిక భాషలో చదవడం, రాయడం మరియు మాట్లాడటంలో నైపుణ్యం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
​ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు స్థానిక భాషా పరీక్ష ఉంటాయి. ఆన్‌లైన్ రాత పరీక్షలో రీజనింగ్ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ మరియు ఇంటర్‌ప్రిటేషన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు మొత్తం 150 మార్కులకు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
​ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు రూ. 59 కాగా, మిగతా అభ్యర్థులకు రూ. 1180. తెలుగు రాష్ట్రాలలో ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, మరియు ఒంగోలులో ఏర్పాటు చేశారు.
​దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ముఖ్యమైన తేదీలు ఇవి:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 20.07.2026.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 09.08.2026.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఆగస్టు/సెప్టెంబరు 2026.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/