పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ అప్రెంటి స్ ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 635 ఖాళీలు భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణలో 20, ఆంధ్రప్రదేశ్ లో 20 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ కచ్చితంగా ఉండాలి. అభ్యర్థులు 28 ఏళ్లు మించి ఉండరాదు. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు వికలాంగులకు వయో సడలింపు ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 12300 స్టెఫండ్ వస్తుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ, వికలాంగులకు ₹100 ఉండగా. . మిగతా వారికి 200 ఉంది. జూన్ 6వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పూర్తి వివరాలకు punjabandsind.bank.in వెబ్ సైట్ ను సంప్రదించండి.
పిఎస్ బీలో అప్రెంటిస్ అవకాశాలు







