డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (RIMC)లో 2027 జూలై విడతకు సంబంధించి 8వ తరగతి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మొదటి దశ ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది.
ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న లేదా పూర్తి చేసిన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2027 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 11.5 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష డిసెంబరు 06న ఆఫ్లైన్ విధానంలో జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ exams.nta.nic.in/RIMCEE/ ద్వారా సెప్టెంబరు 30 (రాత్రి 11:50 గంటల) వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ₹1,000 కాగా, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ₹750గా నిర్ణయించారు.
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (RIMC)లో ప్రవేశాలు







