రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యాంశాలతో కూడిన వివరాలు విడుదలయ్యాయి. మొత్తం 4,029 పోస్టులను భర్తీ చేయనున్నారు.
జేఈ, డీఎమ్ఎస్ విభాగం: 3,994 ఖాళీలు
సీఎమ్ఏ విభాగం: 35 ఖాళీలు
తెలుగు రాష్ట్రాలకు చెందిన సికింద్రాబాద్ జోన్ పరిధిలోనే 111 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయస్సు 01-01-2027 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
అభ్యర్థులను రెండు దశల కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు (CBT-1, CBT-2), సర్టిఫికేట్ల పరిశీలన మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్షల్లో ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 13 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
రైల్వే ఉద్యోగాల భర్తీకి ప్రకటన: మొత్తం 4,029 ఖాళీలు







