దేశంలోని ఐఐటీలతో సహా పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎం.టెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2027) రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 2న ప్రారంభమైంది. ఐఐటీ మద్రాస్ ఈ దరఖాస్తులను స్వీకరిస్తోంది.
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబరు 27 చివరి తేదీ కాగా, ఆలస్య రుసుముతో అక్టోబర్ 5 వరకు అవకాశం ఉంది. పరీక్షలు 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో జరగనున్నాయి.
సిలబస్ మార్పులు: కొత్తగా ‘రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్’ పేపర్ను చేర్చారు. టెక్స్టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్ను ఇంజనీరింగ్ సైన్సెస్లో ఒక సెక్షన్గా మార్చడంతో మొత్తం పేపర్ల సంఖ్య 30గానే ఉంటుంది.
డిజిలాకర్ తప్పనిసరి: అభ్యర్థులు డిజిలాకర్ ఖాతాను గేట్ పోర్టల్తో అనుసంధానించడం తప్పనిసరి అని ఐఐటీ మద్రాస్ స్పష్టం చేసింది. దీనివల్ల దరఖాస్తు ప్రక్రియ వేగంగా, కచ్చితంగా పూర్తవుతుంది.
గేట్ 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం







