ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో (ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ సబర్డినేట్ సర్వీస్) ఖాళీగా ఉన్న 104 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదేని బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 16, 2026న ప్రారంభమై, నవంబర్ 5, 2026 నాటితో ముగుస్తుంది. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ తరహా), కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) మరియు అసెస్మెంట్ ద్వారా జరుగుతుంది. రాత పరీక్షలో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), పేపర్-2 (హిందూ తత్వశాస్త్రం & దేవాలయ వ్యవస్థ) ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
APPSC నోటిఫికేషన్ డిగ్రీ అర్హతతో 104 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు








