మే 13 నుంచి మే 21 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం 12 గంటల వరకు, మరియు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
మే 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్
మే 22 నుంచి మే 25 వరకు బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రాక్టీకల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. దీంతో పాటుగా మే 26న ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష, ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష, 28న ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు.
ఇంటర్ ఫలితాలు 2026 క్లిక్ చేయండి










