రాష్ట్ర ప్రభుత్వం నేడు మధ్యాహ్నం టీజీ ఈసెట్ ఫలితాలను వెల్లడించనుంది. డిప్లమా, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తి చేసిన వారికి బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలు వెల్లడించనుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఉస్మానియా బిసి ఎం కుమార్ మధ్యాహ్నం 3: 30 నిమిషాలకు ఫలితాలు విడుదల చేస్తారు. ఈనెల 15న నిర్వహించిన ఈ పరీక్షకు 18,626 మంది దరఖాస్తు చేసుకోగా 17, 870 మంది హాజరైన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం కౌన్సిలింగ్ ద్వారా వివిధ బీటెక్ కాలేజీలో సీట్ల కేటాయింపు ఉంటుంది.
నేడు టీజీ ఈసెట్ ఫలితాలు విడుదల






