రిలయన్స్ ఫౌండేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) చదువుతున్న విద్యార్థుల కోసం ‘పోస్ట్గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ 2026-27’ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో ఎంపిక చేసిన కోర్సుల్లో మొదటి సంవత్సరం పూర్తికాల (రెగ్యులర్) పీజీ చదువుతున్న విద్యార్థులకు కోర్సు వ్యవధిలో గరిష్టంగా రూ.6,00,000 వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి.
GATE పరీక్ష రాసిన అభ్యర్థులు 550 నుండి 1,000 మధ్య స్కోర్ సాధించి ఉండాలి. GATE రాయని అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ (UG)లో కనీసం 7.5 లేదా అంతకంటే ఎక్కువ CGPA కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా మాత్రమే.
చివరి తేదీ 05 అక్టోబర్ 2026. అర్హత మరియు ఆసక్తి కలిగిన విద్యార్థులు గడువు ముగిసేలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రిలయన్స్ ఫౌండేషన్ పీజీ స్కాలర్షిప్లు 2026-27: రూ. 6 లక్షల వరకు ఆర్థిక సాయం








