పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లు/ప్రాజెక్టుల్లో ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 270 ఖాళీలు ఉండగా, సదరన్ రీజియన్-1 (సికింద్రాబాద్) పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 22 ఖాళీలు ఉన్నాయి.
అర్హత పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ (ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి.
ట్రేడులు ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్ తదితర విభాగాలు.
స్టైపెండ్ (నెలకు) ఐటీఐ అభ్యర్థులకు ₹13,500, డిప్లొమాకు ₹15,000, గ్రాడ్యుయేట్లకు ₹17,500 చెల్లిస్తారు.
అప్రెంటిస్షిప్ కాలం ఒక సంవత్సరం.
విద్యా అర్హతల్లో వచ్చిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.
ఆన్లైన్ దరఖాస్తులు చేసువాలి. దరఖాస్తులు ప్రారంభం 25.08.2026 తేది వరకు.
దరఖాస్తుకు చివరి తేదీ 10.09.2026.
అభ్యర్థులు ముందుగా NAPS/NATS పోర్టల్లో నమోదు చేసుకుని, అనంతరం పీజీసీఐఎల్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.







